16 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు.. అందుకే…

by  |
16 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు.. అందుకే…
X

న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ , నిత్యావసరాలు, మెడిసిన్ ధరలకు నిరసనగా వామపక్ష పార్టీలు దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు వామపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలపై పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 16 నుంచి 30 వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

తరుచుగా పెరుగుతున్న నిత్యావసర, పెట్రోల్ ధరలు ప్రజల జీవనోపాధిపై దాడి చేస్తున్నాయని పార్టీలు పేర్కొన్నాయి. 2 మే 2021 శాసన సభల ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటి వరకు 21 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచారనీ తెలిపాయి. కొవిడ్ సంక్షోభం సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను మరింత భాదలకు కేంద్రం గురిచేస్తోందని ఆరోపించాయి.


Next Story

Most Viewed