- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Benjamin Netanyahu : గాజా మొత్తాని స్వాధీనం చేసుకుంటాం : నెతాన్యాహూ
ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) మరో సంచలన ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) మరో సంచలన ప్రకటన చేశారు. గాజా(Gaza)ను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు వదలబోమని, హమాస్(Hamas)ను పూర్తిగా నిర్మూలించడానికి ఇకపై తీవ్ర సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. తాము గాజా స్ట్రిప్లోని అన్ని ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకొని తీరుతామని, అందుకోసం తీవ్రమైన యుద్ధం జరుగుతోందని, తమ సైనికులు అద్భుతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడులు మొదలుపెట్టింది. దీనివల్ల వేలాది మంది మరణించగా.. లక్షలాది నిర్వాసితులతో గాజాలో తీవ్రమైన సంక్షోభం సృష్టించబడింది. మార్చి 2025 నుంచి గాజాకు సహాయం ఎలాంటి అందడం లేదు, సగం జనాభా కరవు బారిన పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో మే 14న 100 మందికిపైగా మరణించారు.
యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్ను దాడులు ఆపమని, ఆహార నియంత్రణ ఎత్తివేయమని కోరాయి. అమెరికా సహాయం పునఃప్రారంభించే ప్రతిపాదన చేసినా ఇజ్రాయెల్ దానిలో భాగం కాదని ప్రకటించుకుంది. హమాస్ ఓడిపోయే వరకు బందీల విడుదల చర్చలు ఉండవని, కొద్దిపాటి ఆహార సహాయం అనుమతిస్తామని నెతన్యాహూ చెప్పారు. మే 2025లో “ఆపరేషన్ గిడియన్స్ చారియట్”తో ఇజ్రాయెల్ దాడులు మరోసారి తీవ్రం కాగా.. ఆసుపత్రులు వేలాది మంది క్షతగాత్రులతో కిటకిటలాడుతున్నాయి. ఇజ్రాయెల్ చర్యలు ప్రపంచ శాంతిని దెబ్బతీస్తున్నాయని, పాలస్తీనియన్ల నిర్మూలనే లక్ష్యంగా ఉన్నాయని ఈజిప్టు ఆరోపించింది. గాజాలో ఆహారం, నీరు, వైద్య సౌకర్యాల కొరతతో సంక్షోభం తీవ్రమవుతుండటంతో.. అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ.. తాజాగా నెతన్యాహూ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.






