- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక చరిత్రలో మొట్టమొదటి ముస్లిం స్పీకర్గా యుటి ఖాదర్
కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ అలాగే మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యుటి ఖాదర్ నామినేషన్ వేశారు. దీంతో అతన్ని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా కర్ణాటక అసెంబ్లీ చరిత్రలోనే.. స్పీకర్ గా ఎన్నికైన ఏకైక ముస్లిం నాయకుడిగా ఖాదర్ నిలిచారు.
Next Story






