ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించుకోలేదు.. కేంద్రమంత్రి వివరణ

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-29 14:10:24  IST  )

చైనా(China), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) మధ్య నెలకొన్న వివాదంపై లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించుకోలేదు.. కేంద్రమంత్రి వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) మధ్య నెలకొన్న వివాదంపై లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఈ దాడుల్లో వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్రం ప్రకటించింది. అయితే.. దీనిపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. లోక్‌సభలో చర్చకు పట్టుబట్టాయి. దీంతోపాటే చైనా, భారత్‌ మధ్య వివాదంపైనా చర్చకు డిమాండ్ చేశాయి. దీంతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించి.. క్లారిటీ ఇచ్చారు. భారత భూభాగంలోకి చైనా ఒక్క అంగుళం కూడా చొరబడలేదని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పారు.

Next Story