- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
by Dishanational1 |
X
దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించామని, వారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కాంకేర్ ఎస్పీ ఐకె ఎలెసెలా చెప్పినట్టు ఏఎన్ఐ పేర్కొంది. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) సంయుక్త బృందం ఈ ఆపరేషన్లో పాల్గొందని ఎస్పీ వెల్లడించారు. కాగా, కాంకేర్ లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.
Next Story