- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JAMMU KASHMIR: ఉగ్రవాదులను ఉరికించేందుకు బార్డర్లో తుపాకులు పట్టిన గ్రామస్తులు
జమ్మూకశ్మీర్లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా దోడా- చంబా ప్రాంతాలకు చెందిన 17 గ్రామాలకు చెందిన 150మందికి రైఫిల్స్, వ్యూహాలు రచించడం, ఆత్మరక్షణలో ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో మహిళలను సైతం భాగస్వామ్యం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దు ప్రాంతాల్లోనే ఉగ్రవాదులు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో కశ్మీర్ లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గ్రామస్తులు సైతం ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా మందుకు వస్తున్నారు. video






