BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-28 09:14:24  IST  )

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావాస్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ (Kanker Encounter) నిర్వహించేందుకు బయల్దేరారని, ఈ క్రమంలో కాల్పులు జరిగాయని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంకేర్, గరియాబంద్ నుంచి రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. కాగా.. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story