ఘోర ప్రమాదం.. ఈ రిక్షా పేలి ముగ్గురు మృతి

by Dishanational2 |
ఘోర ప్రమాదం.. ఈ రిక్షా పేలి ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రిక్షా బ్యాటరీ పేలి ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రగాయలపాలయ్యారు. సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. అంకిత్ కుమార్ గోస్వామి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో జీవిస్తూ, రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజు వారిలా రిక్షా నడిపి రాత్రి ఇంటికి వచ్చిన అంకిత్ రిక్షాకు చార్జింట్ పెట్టి ఇంటిపనుల్లో నిమగ్నమయ్యాడు.

ఈ క్రమంలో రిక్షా పేలి, ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గరిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story