ఎగ్జిట్ పోల్స్ కావు.. మోడీ, మీడియా పోల్స్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

2024 పార్లమెంట్ ఎన్నికల పూర్తవ్వడంతో శనివారం సాయంత్రం పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి.

ఎగ్జిట్ పోల్స్ కావు.. మోడీ, మీడియా పోల్స్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల పూర్తవ్వడంతో శనివారం సాయంత్రం పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. దీనిపై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ చర్చించిన అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నిన్న వచ్చినవి ఎగ్జిట్ పోల్స్ కావని.. మోడీ, మీడియా పోల్స్ అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండి కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీడియా ప్రశ్నించగా.. సిద్దు మూసే వాలా సాంగ్ విన్నారు కదా.. 295 వస్తాయని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. కాగా శనివారం సాయంత్రం వెలుబడ్డ ఎగ్జిట్ పోల్స్ అన్ని కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో వస్తుందని అంచనా వేశాయి.

Next Story