శవపేటికలా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అంటూ పోస్ట్.. ఆ పార్టీపై నెటిజన్ల ఫైర్

by Disha Web Desk 4 |
శవపేటికలా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అంటూ పోస్ట్.. ఆ పార్టీపై నెటిజన్ల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి నేడు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనాన్ని ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అయితే పార్లమెంట్ న్యూ బిల్డింగ్ ఇనాగరేషన్ వేళ రాష్ట్రీయ జనతాదల్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. శవపేటికను పోలినట్లు కొత్త పార్లమెంట్ భవనం ఉందనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పోస్ట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మొదటి ఫోటోలో మీ పార్టీ భవిష్యత్తు కనిపిస్తుందని, రెండో ఫోటోలో భారత్ భవిష్యత్తు కనిపిస్తుందని ఓ మహిళ కామెంట్ పెట్టారు. మరొకరు స్పందిస్తూ ఇదే మీ పార్టీ భవిష్యత్తు అన్నారు. ఇంకో నెటిజన్ స్పందిస్తూ లాలూజీ ఇదే మీ ఫ్యూచర్ అని కామెంట్ చేశారు.

Next Story