విచిత్ర ఘటన.. చాయ్ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపిన డాక్టర్

by Disha Web Desk 2 |
విచిత్ర ఘటన.. చాయ్ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపిన డాక్టర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సర్జరీ చేయడానికి వెళ్లిన ఓ డాక్టర్ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్​థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్​ కోసం వచ్చిన మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ డాక్టర్​అలా చేయడానికి కారణం చాయ్ ఇవ్వలేదని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌లోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. డాక్టర్ తేజ్‌రామ్ వాళ్లకి చికిత్స అందించడానికి వచ్చారు. సర్జరీ చేయడానికి వెళ్లేముందు చాయ్ కోసం అక్కడ వాళ్లను అడిగాడు. అనంతరం ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాడు. నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు.

డాక్టర్‌కు ఎవరు చాయ్ ఇవ్వలేదు. దీంతో చాయ్ ఇవ్వలేదనే కోపంతో డాక్టర్ సర్జరీ చేయకుండానే ఆపరేషన్​థియేటర్​నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరోవైపు ఆపరేషన్​కోసం మత్తు మందు ఇచ్చిన మహిళలు ఎదురు చూడాల్సి వచ్చింది. వెంటనే అధికారులు మరో డాక్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇలా చేసినందుకు అధికారులు డాక్టర్‌ను విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టి డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed