Humanity : గర్భిణిని 5 కిలోమీటర్లు మోసుకొచ్చిన జవాన్లు.. ప్రాణాలు నిలిపిన బృందం

by Ramesh Naini |

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో జవాన్లు అరుదైన మానవత్వాన్ని చాటుకున్నారు.

Humanity : గర్భిణిని 5 కిలోమీటర్లు మోసుకొచ్చిన జవాన్లు.. ప్రాణాలు నిలిపిన బృందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో జవాన్లు అరుదైన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంద్రావతి జాతీయ పార్కు పరిధిలోని బోటర్ గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న ఐటీబీపీ 29వ బెటాలియన్, నారాయణ్‌పూర్ పోలీసులు తక్షణమే స్పందించారు. అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన జవాన్ల బృందం.. దట్టమైన అడవి, గుట్టల నడుమ సుమారు 5 కిలోమీటర్ల మేర ఆ మహిళను స్ట్రెచర్‌పై కాలినడకన మోసుకుంటూ వెళ్లి ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి వైద్య సాయం అందించిన జవాన్ల సేవలను స్థానికులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.

Next Story