- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యంత గ్రాండ్గా శిఖర్ ధావన్ పెళ్లి.. ఫొటోలు వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ దావన్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఐర్లాండ్కు చెందిన తన ప్రేయసి సోఫీ షైన్తో ఇవాళ ఏడడుగులు వేశారు.

దిశ, వెబ్డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) రెండో పెళ్లి చేసుకున్నారు. ఐర్లాండ్కు చెందిన తన ప్రేయసి సోఫీ షైన్(Sophie Shine)తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో శిఖర్ ధావన్ తోటి క్రీడాకారులు కూడా హాజరయ్యారు. నూతన జంటను అందరూ ఆశీర్వదించారు. కాగా, శిఖర్ ధావన్ 2023లో అయేషా ముఖర్జీతో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకపోవడంతో తాజాగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2010లో భారత్లోకి అరంగేట్రం చేసిన ధావన్, 5000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఎనిమిది మంది వన్డే బ్యాటర్లలో ఒకరిగా రిటైర్ అయ్యాడు. మొత్తం మీద, అతను 167 వన్డేల్లో 44.11 సగటు మరియు 91.35 స్ట్రైక్ రేట్తో 6793 పరుగులు చేశాడు. అతని చివరి వన్డే డిసెంబర్ 2022లో చటోగ్రామ్లో బంగ్లాదేశ్తో జరిగింది. 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2315 పరుగులు, 68 టీ20ల్లో 126.36 స్ట్రైక్ రేట్తో 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడారు.






