సుప్రీంలో సెబీకి షాక్.. మరో 3 నెలల మాత్రమే టైమ్!

by Disha Web Desk 19 |
సుప్రీంలో సెబీకి షాక్.. మరో 3 నెలల మాత్రమే టైమ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ రీసెర్చ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెలువడిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు పొడిగించాలని సెబీ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. మరో మూడు నెలల్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆగస్టు రెండో వారం తర్వాత తదుపరి విచారణ జరుపుతామని అప్పటి వరకు నివేదికను సమర్పించాలని తెలిపింది. చేసే పనిలో వేగం ఉండాలని సెబీ నిరవధికంగా సుదీర్ఘ సమయాన్ని తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది.


Next Story

Most Viewed