- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల తీవ్ర ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు గందరగోళానికి గురయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల తీవ్ర ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు గందరగోళానికి గురయ్యాయి. రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులు నినాదాలతో సభను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ వాయిదా పడిన ఐదు నిమిషాల వ్యవధిలోనే లోక్సభలోనూ విపక్ష సభ్యుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. స్పీకర్ పోడియం వరకు చేరి నినాదాలు చేయడంతో సభను కొనసాగించలేని పరిస్థితుల్లో లోక్సభను కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. విపక్ష సభ్యులు బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చ కోరుతున్నారు. ఈ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






