ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన

by Disha Web Desk 1 |
ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణికులకు కూడా కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు టికెట్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ దుర్ఘటనలో ప్రమాదానికి గురైన వారందరికీ పరిహారం అందుతుందని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.



Next Story

Most Viewed