- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్పీజీపై ప్రధాని మోడీ గుస్సా! ఎందుకో తెలుసా?
సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ పరిధిలోని అహ్మదాబాద్లో ఉన్న నిషాన్ హైస్కూల్లో ప్రధాని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడి.. గుజరాత్లో ఓటింగ్లో పాల్గొన్న తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ చూపు లేని యువతి దగ్గరకు వెళ్లి మోడీ మాట్లాడుతున్న సమయంలో వచ్చిన భద్రతా సిబ్బందిని దూరం వెళ్ళాలని మోడీ సూచించారు. అయితే, చూపులేని యువతితో మాట్లాడుతున్న సమయంలో ఎస్పీజీ కమాండర్ ఆమె దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాడు.. ఈ క్రమంలోనే ప్రధాని వారిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.






