- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
G20 Summit: కీలక విషయాలు ప్రస్తావించిన ప్రధాని మోడీ
దక్షిణాఫ్రికా వేదికగా జీ20 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కీలక విషయాలు వెల్లడించారు.

దిశ, వెబ్డెస్క్: దక్షిణాఫ్రికా వేదికగా జీ20 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కీలక విషయాలు వెల్లడించారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల పరివర్తన సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. ఏఐ సహా డిజిటల్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సురక్షితమైన, భద్రత గల, నమ్మకమైన కృత్రిమ మేధస్సు అభివృద్ధి, విస్తరణ, ఉపయోగాన్ని తెలియజేశారు. మహిళలు, బాలికల సాధికారత గురించి బలంగా ప్రస్తావించారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆహార భద్రత, పోషకాహార విషయంలో దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలను పునరుద్ఘాటించారు. ప్రపంచ అభివృద్ధి ప్రమాణాలను సమీక్షించాలని పిలుపునిచ్చారు. అందరినీ కలుపుకొని పోయే స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టడం ప్రస్తుత అవసరమని స్పష్టం చేశారు. భారతదేశ నాగరికతా విలువలు, ముఖ్యంగా సమగ్ర మానవతావాదం ఈ విషయంలో మార్గాన్ని చూపుతాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు సహా డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి, మాదకద్రవ్యాలు-ఉగ్రవాద సంబంధాన్ని అడ్డుకోవడానికి ఒక ప్రత్యేక జీ20 చొరవను మోడీ ప్రతిపాదించారు. ‘మాదకద్రవ్యాలు-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరుద్దాం’ అని పిలుపునిచ్చారు.






