త్రివిధ దళాధిపతులపై ప్రధాని మీటింగ్.. కీలక విషయాలపై చర్చ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-11 05:39:57  IST  )

కాల్పుల విరమణ తర్వాత కూడా భారత్ - పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) తన నివాసంలో మరోసారి కీలక భేటీ నిర్వహించారు.

త్రివిధ దళాధిపతులపై ప్రధాని మీటింగ్.. కీలక విషయాలపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: కాల్పుల విరమణ తర్వాత కూడా భారత్ - పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) తన నివాసంలో మరోసారి కీలక భేటీ నిర్వహించారు. త్రివిధ దళాధిపతులు, సీడీఎస్ అనిల్ చౌహాన్ (CDS Anil Chowhan), రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), కాల్పుల విరమణతో పాటు.. రేపు జరగనున్న ఇరుదేశాల సైనిక అధికారుల చర్చల్లో చర్చించాల్సిన విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత, పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్చిస్తున్నట్లు సమాచారం.

Next Story