- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత్ పై 500 డ్రోన్లు ప్రయోగించిన పాక్.. దాడిపై కీలక సమాచారం వెల్లడించిన రక్షణ వర్గాలు

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంపై పాకిస్థాన్ 500 డ్రోన్లను ప్రయోగించిందని భారత రక్షణ వర్గాలు (Indian Defence Sources) వెల్లడించాయి. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. దీంతో గురువారం పాకిస్థాన్ (Pakistan) భారత సరిహద్దుల్లో డ్రోన్లు (Drones), మిసైళ్ల (Missiles)తో దాడికి యత్నించింది. దీనిని గ్రహించిన భారత ఆర్మీ (Indian Army) పాక్ డ్రోన్లు, మిస్సైళ్లకు గాలిలో ఉండగానే కూల్చివేసింది.
అయితే పాకిస్థాన్ భారత్ పై ప్రయోగించిన డ్రోన్లకు సంబంధించిన వివరాలను భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా.. నిన్న రాత్రి పాకిస్థాన్ దాదాపు 500 డ్రోన్ లను భారత స్థావరాల వైపు ప్రయోగించిందని, లడఖ్లోని సియాచిన్ బేస్ క్యాంప్ నుండి గుజరాత్లోని కచ్ ప్రాంతం వరకు 24 ప్రదేశాలలో ఈ డ్రోన్లను ప్రయోగించిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ డ్రోన్లలో దాదాపు 50 డ్రోన్లను వైమానిక రక్షణ దళాలు తుపాకుల ద్వారా నాశనం చేయగా.. మరో 20 డ్రోన్లను సాఫ్ట్ కిల్స్ ద్వారా కూల్చివేశారని తెలిపారు.
అంతేగాక ఇందులో చాలా డ్రోన్లు నిరాయుధమైనవి అని, ఈ డ్రోన్లలో కెమెరాలు అమర్చబడి, బహుశా వాటి గ్రౌండ్ స్టేషన్లకు ఫుటేజ్ను ప్రసారం చేసి ఉండొచ్చని ఇండియన్ డిఫెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లలో మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే దాదాపు అన్ని డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు తొలగించాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. అయితే పాకిస్థాన్ కెమెరాలతో ఉన్న డ్రోన్ల ప్రయోగానికి గల కారణాలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించిందా? లేక మరేదైనా కారణం ఉందా అని కోణంలో రక్షణ శాఖ వర్గాలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.