ఆస్కార్ విన్నర్స్తో ప్రధాని మోడీ భేటీ.. ఆయన ఏమన్నారంటే..?

by Dishafeatures2 |
ఆస్కార్ విన్నర్స్తో ప్రధాని మోడీ భేటీ.. ఆయన ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్కార్ అవార్డు సాధించి దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ మూవీ డైరెక్టర్ కార్తీక్ గొన్ సాల్వ్స్, నిర్మాత గునీత్ మోంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రధాని మోడీకి ఆస్కార్ అవార్డులు అందించారు. అనంతరం ఈ ఫోటోలను పీఎం మోడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీ విజయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఈ రోజు ఈ సినిమాకు సంబంధిచిన టీమ్ ను కలిసే అదృష్టం లభించింది. వారు దేశ గౌరవాన్ని మరింత పెంచారు.’’ అంటూ పీఎం ట్వీట్ చేశారు.

కాగా ప్రధాని మోడీ ట్వీట్ కు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మూవీ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా రిప్లై ఇచ్చారు. ‘‘ మా సినిమాను గౌరవించి మీ ఇంటికి పిలిచినందుకు థాంక్యూ సార్. మీ సపోర్టు, ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనవి. మీరిచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశ సంస్కృతి సంప్రదాయాలు, భిన్నత్వం, సంపదకు అద్దం పట్టేలా మరిన్ని సినిమాలు చేస్తా’’మంటూ హామీ ఇచ్చారు.


Next Story