- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా పోరాటం పేరు మార్పుపై కాదు: ఖర్గే
నరేగా స్థానంలో జీ రామ్ జీ పేరుతో కొత్త బిల్లు తీసుకురావడంపై ఇవాళ పార్లమెంట్ ఆవరణంలో విపక్షాలు ర్యాలీ నిర్వహించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మా పోరాటం నరేగా (NREGA Name Change) పేరు మార్పుపై కాదని, హక్కులు కాపాడటం కోసమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు కేంద్ర ప్రభుత్వం పేదల పని హక్కులను తొలగిస్తోదని ధ్వజమెత్తారు. పేదల కోసం చివరి వరకు పోరాడుతామన్నారు. నరేగా పేరు మార్పుపై ఇవాళ విపక్షాలు పార్లమెంట్ ఆవరణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో పాటు పెద్దఎత్తున విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. మహాత్మగాంధీ ఫోటోలు, ఫ్లెక్సీ పట్టుకుని పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం నుండి మక్కర్ దావర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఇక కేంద్రం తీసుకువచ్చిన జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని వివిధ సంఘాలు నిర్ణయించారు. ఈ నెల 21న అన్ని జిల్లాల కేంద్రాలలో గాంధీ విగ్రహాల వద్ద గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు.






