పెను ప్రమాదం నుంచి బయటపడ్డ జమ్మూ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ

by Dishanational1 |
పెను ప్రమాదం నుంచి బయటపడ్డ జమ్మూ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు గురువారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. అనంతనాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఖానాబాల్‌లో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొహబూబా ముఫ్తీకి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ, మరొక కారును ఢీకొనడంతో ఆమె వ్యక్తిగత భద్రత కోసం నియమించిన పోలీసు అధికారి గాయపడ్డారు. ముఫ్తీ కారు ముందుభాగం పూర్తిగా ద్వంసం కాగా, ఈ ఘటన నుంచి తన తల్లి సురక్షితంగా బయటపడ్డారని ముఫ్తీ కుమార్తె ఓ ప్రకటనలో తెలిపారు. దేవుడి దయవల్ల ఏమీ కాలేదని, భద్రతా సిబ్బంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని ఆమె పేర్కొన్నారు.

Next Story

Most Viewed