సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే.. ఆనాడు పేలుళ్లు జరిగేవి కావు : ఉజ్వల్ నికమ్

by Naga Rani Yarlagadda |

ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన న్యాయవాది ఉజ్వల్ నికమ్ ముంబై పేలుళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే.. ఆనాడు పేలుళ్లు జరిగేవి కావు : ఉజ్వల్ నికమ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన న్యాయవాది ఉజ్వల్ నికమ్ ముంబై పేలుళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్ 1993లో ఆయుధాల వ్యాన్ గురించి ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే ముంబై పేలుళ్లు జరిగేవి కాదన్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్నీ వణికించాయి. ఈ పేలుళ్ల కేసును ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ వాదించారు. తాజాగా ఆయన రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో .. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేలుళ్లపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

Next Story