ఆ ముగ్గురిపై నెట్టింటా వైరల్ అవుతున్న మీమ్స్

by Dishanational1 |
ఆ ముగ్గురిపై నెట్టింటా వైరల్ అవుతున్న మీమ్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వాటిన చూసిన నెటిజన్స్ ముసిముసిగా నవ్వేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ప్రముఖ సినీ నటులు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ యొక్క కామెడీ చిత్రం కోసం నెటిజన్స్ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి దేశీ ఉల్లాసకరమైన మీమ్ లతో ట్విట్టర్ లో మునిగిపోయారు. అభిమానులు నిస్సందేహంగా హేరా ఫేరి 3 కోసం ముగ్గురి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నట్లు మీమ్స్ లో స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ మీమ్స్ ఇటు ఆశ్చర్యం.. అటు నవ్వులు పూయిస్తుండడం గమనార్హం. యూజర్లలో ఒకరు 'ముఝే ఫిల్మ్ దేఖ్నీ హై రే బాబా' అన్నారు. అయితే, మరొకరు.. 'రాజు తిరిగి వచ్చాడు' అని రాస్తూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. మూడోది అక్షయ్ కుమార్ సినిమాలోని డైలాగ్ ను సూచిస్తూ 'పైసా హి పైసా హోగా' అని రాశారు. ప్రస్తుతం ఇవి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read: పెట్రోల్, డిజిల్‌పై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!

Next Story

Most Viewed