మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు: మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ

by Dishanational2 |
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు: మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహాదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కోల్‌కతాకు చెందిన నితిన్ తిబ్రేవాల్, రాయ్‌పూర్‌ వ్యక్తి అమిత్ అగర్వాల్‌లను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం వీరిని రాయ్‌పూర్ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 17 రోజుల కస్టడీ విధించినట్టు ఈడీ న్యాయవాది సౌరబ్ పాండే తెలిపారు. ఈ కేసులో నిందితుడైన వికాష్ చప్పరియాకు తిబ్రేవాల్‌ సన్నిహితుడు అని ఆరోపణలు వచ్చాయి. అతను మహాదేవ్ యాప్ నుంచి వచ్చిన లాభాలతో ఎఫ్‌పీఐ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక మరో వ్యక్తి అమిత్ అగర్వాల్ ఈ కేసులో మరో నిందితుడైన అనిల్ కుమార్ అగర్వాల్ బంధువు కావడం గమనార్హం.


Next Story