- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వల్పరై ప్రమాద బాధితులకు కేరళ సర్కార్ భారీ సాయం
వల్పరై ప్రమాద బాధితులకు కేరళ ప్రభుత్వం భారీ ఊరట! మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్: వల్పరైలో పాంగ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిన ఘటనలో బాధితులకు ఆర్థిక సాయం అందించాలని కేరళ రాష్ట్ర కేబినెట్ (Kerala State Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ రక్షణ లేని ఐదుగురు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMDRF) నుంచి ఈ మొత్తాన్ని స్కూల్ బస్ డ్రైవర్ నౌషాద్ అలీ, వంట సిబ్బంది సాజిదా, రుఖియా, షకీలా విద్యార్థి మహమ్మద్ హిషామ్ కుటుంబాలకు అందజేయనున్నారు. ఇన్సూరెన్స్ ఉన్న ఇతర ఉపాధ్యాయులకు సంబంధిత బీమా సంస్థల ద్వారా పరిహారం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మృతుల కుటుంబాలకే కాకుండా, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం అండగా నిలిచింది. గాయపడిన మహమ్మద్ షాహద్, మస్నీన్, డ్రైవర్ మహమ్మద్ ఫాహిస్ వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. ఇన్సూరెన్స్ ఉన్న బాధితులకు కూడా, వారి బీమా పరిమితిని మించిన చికిత్స ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రీయింబర్స్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు, 12వ పే కమిషన్ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన 14 అదనపు పోస్టుల సృష్టికి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.






