షిప్‌ను హైజాక్ చేసిన పైరేట్లు.. భారత యుద్ధ నౌక ఎంట్రీతో ఏమైందంటే ?

by Dishanational4 |
షిప్‌ను హైజాక్ చేసిన పైరేట్లు.. భారత యుద్ధ నౌక ఎంట్రీతో ఏమైందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అరేబియా సముద్రంలో భారత నేవీ మరోసారి సత్తా చాటుకుంది. ఇరాన్ ఫిషింగ్ నౌక ‘ఎఫ్‌వీ ఇమాన్‌’ సోమాలియా తూర్పు తీరానికి చేరుకోగానే సముద్రపు దొంగలు చుట్టుముట్టి హైజాక్ చేశారు. ఆ నౌక నుంచి ఎమర్జెన్సీ హెల్ప్ మెసేజ్ అందడంతో గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌‌ సముద్ర జలాల్లో పహారా కాస్తున్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర అలర్ట్ అయింది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన భారత యుద్ధనౌక.. విజయవంతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. హైజాక్ అయిన ఇరాన్ ఫిషింగ్ నౌక నుంచి సముద్రపు దొంగలను భారత నేవీ దళాలు తరిమికొట్టాయి. దీంతో ఆ షిప్‌లోని 17 మంది మత్స్యకారులు సురక్షితంగా పైరేట్ల చెర నుంచి విడుదలయ్యారు.



Next Story

Most Viewed