IAF Exercise: పాకిస్తాన్ సరిహద్దులో సైనిక విన్యాసాలు.. భారత యుద్ధ విమానాల దూకుడు

by Mahesh Kanagandla |

పాకిస్తాన్ సరిహద్దులో భారీస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టాలని భారత వైమానిక దళం డిసైడ్ అయింది. రాజస్తాన్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నోటామ్ ఇష్యూ చేసింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు పాకిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలో రాజస్తాన్ పరిధిలోనే ఈ విన్యాసాలు జరగనున్నాయి.

IAF Exercise: పాకిస్తాన్ సరిహద్దులో సైనిక విన్యాసాలు.. భారత యుద్ధ విమానాల దూకుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ సరిహద్దులో భారీస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టాలని భారత వైమానిక దళం డిసైడ్ అయింది. రాజస్తాన్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నోటామ్ ఇష్యూ చేసింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు పాకిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలో రాజస్తాన్ పరిధిలోనే ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ సమయంలో ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్ లేదా టేకాఫ్‌లు ఉండవు. ఈ ఏరియాలో గగనతలంలోకి మరే ఇతర విమానాలు రావడానికి వీల్లేదు. ఈ మిలిటరీ డ్రిల్స్‌లో భారత వైమానిక దళంలోని శక్తివంతమైన యుద్ధ విమానాలు గింగిరాలు తిరగనున్నాయి. రాఫేల్, మిరాజ్ 2000, సుఖోయ్-30 సహా పలు ఫైటర్ జెట్లు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి. ఈ విన్యాసాలను ఉన్నత అధికారులు పర్యవేక్షించనున్నారు.

ఏప్రిల్ 25న భారత్ భారీస్థాయిలో సైనిక విన్యాసాలు జరిపింది. రాఫేల్ జెట్లు, ఉతన్న శ్రేణి పైలట్లు ఆక్రమణ్ ఆపరేషన్ పేరిట ఈ డ్రిల్స్ చేపట్టారు. కఠిన భౌగోళిక ప్రాంతాల్లో సుఖోయ్-30ఎంకేఐ స్క్వాడ్రన్లతో విన్యాసాలు చేశారు. సుదూరాల్లోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించారు. వైమానిక దళంతోపాటు నావికా దళం కూడా అరేబియా సముద్రంలో భారీ స్థాయిలో మిలిటరీ ఎక్సర్‌సైజులు నిర్వహించింది.

Next Story