బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు

by Malleboina Mahesh |

బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.

బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత హైకమిషన్ (Indian High Commission) కార్యాలయానికి సరైన భద్రత కల్పించడంలో వైఫల్యం, అక్కడ చోటుచేసుకున్న నిరసనల నేపథ్యంలో, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. భారత దౌత్యవేత్తలు, కార్యాలయ సిబ్బంది భద్రత విషయంలో తమకు ఉన్న తీవ్ర ఆందోళనలను భారత్ ఈ సందర్భంగా వెల్లడించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం దౌత్య కార్యాలయాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత స్థానిక ప్రభుత్వంపై ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారత వ్యతిరేక నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ భద్రతా అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసనకారులు చొరబడటం, ఆస్తులకు నష్టం కలిగించడం వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్గత అస్థిరత కారణంగా దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు తక్షణమే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భారత్ ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. మరి భారత్ సమన్లపై బంగ్లాదేశ్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story