హిందుజా గ్రూప్ ఛైర్మన్ మృతి

by Muthe.Rajitha |

హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందుజా(85) కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

హిందుజా గ్రూప్ ఛైర్మన్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందుజా(85) కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న హిందుజా.. నేడు లండన్ లో మృతి చెందారు. ఈ విషయాన్ని బ్రిటీష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామి రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ హిందుజా మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని బ్రిటిష్ హౌస్ పేర్కొంది. కాగా గత కోనేళ్ళుగా హిందుజా లండన్ లో నివాసం ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో లండన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు సమాచారం.

Next Story