దేశంలో హెచ్3ఎన్2తో మహిళ మృతి

by Dishanational1 |
దేశంలో హెచ్3ఎన్2తో మహిళ మృతి
X

గాంధీనగర్: గుజరాత్‌లో ఇన్‌ఫ్లుయెంజా హెచ్‌3ఎన్2 వైరస్ సోకి ఓ మహిళ మరణించింది. వడోదరా ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న 58 మహిళ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఈ వైరస్‌తో మరణించినవారి సంఖ్య ఏడుకు చేరింది. మొదటి మరణం కర్ణాటకలో హసన్ జిల్లాలో సంభవించిన సంగతి తెలిసిందే. జనవరి నుంచి మార్చి వరకు రెండు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు 451 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేసులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు, ఈ నెలాఖరులోగా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అంచనా వేసింది. అయితే హెచ్3ఎన్2తో పాటు ఇన్‌ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లు సీజనల్ అని, ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed