- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశంలో హెచ్3ఎన్2తో మహిళ మృతి
by Dishanational1 |
X
గాంధీనగర్: గుజరాత్లో ఇన్ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ సోకి ఓ మహిళ మరణించింది. వడోదరా ఎస్ఎస్జీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న 58 మహిళ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఈ వైరస్తో మరణించినవారి సంఖ్య ఏడుకు చేరింది. మొదటి మరణం కర్ణాటకలో హసన్ జిల్లాలో సంభవించిన సంగతి తెలిసిందే. జనవరి నుంచి మార్చి వరకు రెండు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు 451 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేసులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు, ఈ నెలాఖరులోగా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అంచనా వేసింది. అయితే హెచ్3ఎన్2తో పాటు ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లు సీజనల్ అని, ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
Next Story