ఫస్ట్ నైట్ కోసం రెడీ చేసిన గదిలో దారుణం.. వరుడు ఏం చేశాడంటే?

by Disha Web Desk 2 |
ఫస్ట్ నైట్ కోసం రెడీ చేసిన గదిలో దారుణం.. వరుడు ఏం చేశాడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండ్రోజుల క్రితమే పెళ్లి జరిగింది. భార్యను ఇంటికి తీసుకొచ్చిన రోజే వరుడు, వధువుతో గొడవపడ్డాడు. అదే కోపంతో ఫస్ట్ నైట్‌ కోసం సిద్ధం చేసుకున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. కనౌజ్ జిల్లా మచారియా గ్రామానికి చెందిన దేవిపూర్వ జసోదా కనౌజ్ గోల్డి కుమార్తెతో మనోజ్‌కుమార్‌కి వివాహమైంది. ఏదో విషయమై యువకుడు నవవధువుతో గొడవ పడ్డాడు. ఆ మనస్తాపంతో రాత్రి శోభనం కోసం ఏర్పాటు చేసిన గదిలో..వధువు టాయిలెట్‌కి వెళ్లొచ్చే సరికి ఉరివేసుకుని కనిపించాడు.

దీంతో భర్త ఉరివేసుకోవడం చూసిన భార్య షాకై కేకలు వేసింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతుని భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పడి ఉండొచ్చని..దాని వల్లే ఫస్ట్‌నైట్‌ రూమ్‌లో మనస్పర్థలు తలెత్తి ఉంటాయని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గదిలో క్లూస్ కోసం వెదికారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు స్టేషన్‌ ఆఫీసర్‌ దైనిక్‌ భాస్కర్‌ తెలిపారు. టాయిలెట్‌కు వెళ్లి వచ్చే గ్యాప్‌లో ఉరివేసుకోని చనిపోవడం అంటే కాస్త అనుమానంగానే ఉందని.. దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed