చెరుకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. క్వింటాల్‌పై ఎంత పెంచిందంటే..

by Dishanational5 |
చెరుకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. క్వింటాల్‌పై ఎంత పెంచిందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో: చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. క్వింటాల్ చెరుకుపై ‘ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్(ఎఫ్ఆర్పీ- చెరుకు మిల్లులు రైతులకు చెల్లించాల్సిన కనీస ధర)పై రూ.25 పెంచింది. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు క్వింటాల్ చెరుకు కనీస ధర రూ.315గా ఉండగా, తాజా పెంపుతో రూ.340కి చేరనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మోడీ హయాంలో క్వింటాల్ చెరుకుపై అత్యధికంగా రూ.25 పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వాటాదారులతో సంప్రదించిన తర్వాత ఎఫ్ఆర్పీని నిర్ణయిస్తారు. ప్రధాని మోడీ గత పదేళ్లుగా రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నారని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతోపాటు 2021-22 నుండి 2025-26 వరకు మొత్తం రూ.1179.72 కోట్లతో ‘మహిళల భద్రత’పై అంబ్రెల్లా స్కీమ్‌ను కొనసాగించాలనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ఆమోదించినట్టు వెల్లడించారు.



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed