ఎన్నికల బరి నుంచి గులాం నబీ ఆజాద్ ఔట్

by Dishanational4 |
ఎన్నికల బరి నుంచి గులాం నబీ ఆజాద్ ఔట్
X

దిశ, నేషనల్ బ్యూరో : డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ కీలక ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఆజాద్ తొలుత భావించారు. ఏప్రిల్ 2న నామినేషన్ కూడా వేశారు. అయితే బుధవారం జరిగిన డీపీఏపీ కార్యవర్గ సమావేశం వేదికగా ఈ ఎన్నికల్లో గులాం నబీ ఆజాద్ పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈవివరాలతో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటు స్థానం నుంచి పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్‌ పోటీ చేస్తున్నారు.

Next Story