దేశ ప్ర‌జ‌ల‌కు అల‌ర్ట్..ఆధార్ ఉచిత అప్డేట్‌ గడువు పొడిగింపు

by velandi.Saikiran |   (  Updated:2026-05-22 21:30:34  IST  )

ఆధార్ డాక్యుమెంట్ ను ఫ్రీగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే అవకాశాన్ని UIDAI పొడిగించింది.

దేశ ప్ర‌జ‌ల‌కు అల‌ర్ట్..ఆధార్ ఉచిత అప్డేట్‌ గడువు పొడిగింపు
X

దిశ‌, వెబ్ డెస్క్: భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఆధార్ డాక్యుమెంట్ ను ఫ్రీగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే అవకాశాన్ని UIDAI పొడిగించింది. 2027 జూన్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఇక‌ ఇందు కోసం మై ఆధార్ పోర్టల్ లో ఆధార్ నెంబర్, ఓటీపీతో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అప్డేట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయాలి. అనంతరం ప్రూఫ్ కోసం అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇదే ప్రాసెస్ ను ఆధార్ సెంటర్లలో చేసుకుంటే, ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది ఇలా ఉండ‌గా, ప్ర‌తి ప‌థ‌కం, ఇతర అవ‌స‌రాల‌కు క‌చ్చితంగా ఆధార్ కార్డు కావాల్సిందే. అస‌లు ఈ ఆధార్ కార్డ్ మ‌నిషికి ఒక గుండెకాయ లాంటిద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ కార్డు లేకపోతే, ఏ పని జరుగదు.

Next Story