ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మింగిన నర్మద..

by Disha Web Desk 6 |
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మింగిన నర్మద..
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ కచ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నర్మదా కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. నీళ్లు తెచ్చేందుకు వెళ్లి కాలువలో పడి మునిగిపోతున్న ఓ మహిళను రక్షించే ప్రయత్నంలో వారు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషుల ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. నర్మదా కాలువ సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి గుజరాత్‌కు దాదాపు 458 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.

Next Story