ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జననం.. ఎక్కడంటే?

by Disha Web Desk 4 |
ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జననం.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జన్మించారు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోన రిమ్స్ లో సోమవారం చోటు చేసుకుంది. ఐదుగురు నవజాత ఆడ శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఛత్రలోని ఇత్కోరికి చెందిన అనితా కుమారి(27) సోమవారం ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన ఆడ శిశువులు బరువు తక్కువగా ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచారు. ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జన్మించడం చాలా అరుదు అని డాక్టర్లు తెలిపారు. రాంచీ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ సుమన్ సిన్హా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Next Story

Most Viewed