ఫోన్ కోసం రిజర్వాయర్‌ ఖాళీ చేసిన ఆఫీసర్.. కేసు నమోదు..

by Disha Web Desk 12 |
ఫోన్ కోసం రిజర్వాయర్‌ ఖాళీ చేసిన ఆఫీసర్.. కేసు నమోదు..
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వాయర్‌లో ఫోన్ పడిపోయిందని.. ఫొన్ కోసం డ్యామ్‌లోని నీటిని తోడేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో చోటు చేసుకుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఫోనుకోసం రిజర్వాయర్‌లోని 41 లక్షల లీటర్ల నీటిని తోడేసినందుకు అధికారి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను సప్పెండ్ చేశారు. అలాగే దీంతో విశ్వాస్ తో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మిగిలిన ఇద్దరు నిందితులు విశ్వాస్ అనధికార చర్యకు మద్దతు ఇచ్చారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇంతకుముందు, రిజర్వాయర్‌ను ఖాళీ చేసినందుకు విశ్వాస్‌కు సుమారు ₹53,000 జరిమానా విధించబడింది.


Next Story

Most Viewed