యూపీలో వింత.. మహిళ గర్భాశయంలో కాదు కాలేయంలో పెరుగుతున్న పిండం..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ మహిళకు కొన్ని వారాలుగా వాంతులు, కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కుటుంబీకులు. టెస్టులు, ఆల్ట్రాసౌండ్‌తో స్పష్టత రాకపోయేసరికి ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు.

యూపీలో వింత.. మహిళ గర్భాశయంలో కాదు కాలేయంలో పెరుగుతున్న పిండం..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ మహిళకు కొన్ని వారాలుగా వాంతులు, కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కుటుంబీకులు. టెస్టులు, ఆల్ట్రాసౌండ్‌తో స్పష్టత రాకపోయేసరికి ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. ఇందులో వైద్య రంగంలోనే అత్యంత అరుదైన విషయం బయటపడింది. ఈ మహిళ గర్భంతో ఉందని.. కానీ పిండం గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరుగుతుందని గుర్తించబడింది. ఇలాంటి కేసులు ప్రపంచంలో కేవలం ఎనిమిది మాత్రమే నమోదు కాగా ఇండియాలో ఇదే మొదటిది. ఇక ఈ పరిస్థితిని ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తుండగా.. ప్రస్తుతం ఆమె వైద్యుల పరిశీలనలో ఉంది.

కాగా మీరట్‌లోని ప్రైవేట్ ఇమేజింగ్ సెంటర్‌లో రేడియాలజిస్ట్ డాక్టర్ కేకే గుప్తా ఈ స్కాన్‌ గురించి వివరించారు. 12 వారాల గర్భం కాలేయం కుడి భాగంలో ఉందని.. హార్ట్ బీట్ క్లియర్‌గా కనిపించిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని.. లివర్‌లో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయని.. పిండం పెరిగే కొద్దీ అవి పగిలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు శస్త్రచికిత్స అవసరమని.. డాక్టర్లు ఇందుకోసం సిద్ధమవుతున్నారని తెలిపారు.

Next Story