బ్రేకింగ్: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎ‌న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని రూ. 752 కోట్ల ఆస్తులను ఇవాళ ఈడీ జప్తు చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మరోసారి ఈ కేసు తెరపైకి రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed