ఢిల్లీ లిక్కర్ స్కామ్: మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ!

by Disha Web Desk 19 |
ఢిల్లీ లిక్కర్ స్కామ్: మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. శుక్రవారం మనీష్ సిసోడియా బెయిల్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు విన్నది. ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన రౌస్ ఎవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మార్చి 9వ తేదీన అరెస్ట్ చేసింది. సిసోడియాను పలుమార్లు కస్టడీకి తీసుకుని ఈడీ విచారించింది. ప్రస్తుతం మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా జైలులో ఉన్నారు.

Next Story

Most Viewed