గో మూత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురాలేదు: ఉద్ధవ్ ఠాక్రే

by Disha Web Desk 12 |
గో మూత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురాలేదు: ఉద్ధవ్ ఠాక్రే
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డాడు. శివసేన పేరు, చిహ్నాన్ని కోల్పోయిన తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న ఠాక్రే మాట్లాడుతూ.. ఆవు మూత్రం వలన భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదని.. స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలు అర్పిస్తే స్వాతంత్రం వచ్చిందని అన్నారు. అలాగే.. కాంగ్రెస్, ఎన్‌సీపీ తనను బూటు ముఖ్యమంత్రిగా చేశారిన అమిత్ షా అన్నారు. మరి ప్రస్తుతం మీరు మేఘాలయలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా మేఘాలయలో బీజేపీ కేవలం 20 స్థానాల్లో పోటి చేయగా రెండు స్థానాల్లో గెలిచి ఎన్‌పీపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు వెళుతుంది. దీనిని ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీపై విమర్శలు చేశారు.

Next Story

Most Viewed