బీబీ నగర్​ ఎయిమ్స్ ​డెవలప్ ​చేస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

by Disha Web Desk 13 |
బీబీ నగర్​ ఎయిమ్స్ ​డెవలప్ ​చేస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య సంరక్షణ, టెలి కన్సల్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆరోగ్య సంరక్షణ కోసం ఫీల్డ్ వర్కర్లకు నైపుణ్యాన్ని కల్గిస్తున్నామని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి స్వస్త్య సురక్ష యోజన స్కీమ్​తో వైద్యారోగ్య రంగం ఎంతో బలోపేతం అవుతున్నట్లు పేర్కొన్నది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో వైద్య విద్య, పరిశోధన, క్లినికల్ కేర్‌ రంగాల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది.

దీనిలో భాగంగానే ఎయిమ్స్​ బీబీనగర్​ను కూడా డెవలప్​ చేశామని కేంద్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1366 కోట్లను రిలీజ్ ​చేసినట్లు ప్రకటించింది. కాంప్లెక్స్‌ కోసం రూ. 350 కోట్లు, జీతాలకు రూ. 65 కోట్లు, క్యాపిటల్ హెడ్ కింద రూ. 21.72 కోట్లు, జనరల్ హెడ్ కు రూ.23.50 కోట్లు కేటాయించినట్లు కేంద్రం పేర్కొన్నది.

Next Story

Most Viewed