ఒడిశా రైలు ప్రమాదంపై కేసు నమోదు

by Disha Web Desk 2 |
ఒడిశా రైలు ప్రమాదంపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 275 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ‘నిర్లక్ష్యంతో మరణాలకు కారణమయ్యారు. ప్రాణాలకు హాని కలిగించారు’ వంటి అభియోగాలతో ఒడిశా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. అయితే, ప్రస్తుతం ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన రైల్వే ఉద్యోగులు ఎవరనేది ఇంకా నిర్థారించలేదని, దర్యాప్తులో ఆ విషయం బయటపడుతుందని ప్రాథమిక సమాచార నివేదికను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed