BREAKING: పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

by Disha Web Desk 1 |
BREAKING: పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులకు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల కార్యక్రమంలో అట్టహాసంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, వెంకయ్య నాయుడును పద్మ విభూషణ్ సత్కరించారు. ఆయన చేసిన ప్రజాసేవకు గాను దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి జయశంకర్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Read More..

BREAKING: పడిపోతున్న నన్ను నిలబెట్టింది మల్కాజ్‌గిరి ప్రజలే: సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ కామెంట్స్

Next Story

Most Viewed