BREAKING: జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం

by Disha Web Desk 1 |
BREAKING: జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంతో ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త కార్యాలయ ఆవరణలో ఉన్న కేబుళ్లకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున్న మంటలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తమైన బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Next Story

Most Viewed