- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై నుంచి తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో నలుగురు విద్యార్థులు ఫుట్బోర్డింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని బస్సు డ్రైవర్ ఓవర్టేక్ చేస్తుండగా.. బస్సులోంచి నలుగురు విద్యార్థులు అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ చక్రాల కిందపడి ఆ నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story