BREAKING: చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం

by Disha Web Desk 1 |
BREAKING: చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై నుంచి తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో నలుగురు విద్యార్థులు ఫుట్‌బోర్డింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని బస్సు డ్రైవర్ ఓవర్‌టేక్ చేస్తుండగా.. బస్సులోంచి నలుగురు విద్యార్థులు అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ చక్రాల కిందపడి ఆ నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed