విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-02 03:24:03  IST  )

విద్యార్థులు ఆసక్తి ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు ఆసక్తి ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షా బాధ్యతలను చేపట్టిన ఐఐటీ కాన్పుర్‌ తుది ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఐఐటీ కాన్పూర్ అధికారిక వైబ్‌సైట్‌లోకి https://results25.jeeadv.ac.in/ వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్ (B.Tech), బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (BS), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు. అయితే, దేశ వ్యాప్తంగా మొత్తం 1.80 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యారు. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌ (Xhosa Counseling)లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. కానీ, వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. అదేవిధంగా 2024-25 విద్యా సంవత్సరానికి గాను 23 ఐఐటీల్లో 17,760 సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. జూన్‌ 3 సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లుగా ఐఐటీ కాన్పుర్‌ ఇప్పటికే షెడ్యూల్‌ రిలీజ్ చేసింది.

Next Story