కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా.. అశోక్ గెహ్లట్

by Disha Web Desk 21 |
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా.. అశోక్ గెహ్లట్
X

జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ గురువారం స్పష్టత నిచ్చారు. పార్టీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తాను నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాజస్థాన్ నుంచి తానెప్పుడూ దూరంగా ఉండనని, రాష్ట్రం కోసం పనిచేస్తానని చెప్పారు. 'పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నేను నామినేషన్ దాఖలు చేస్తాను. ఆ తర్వాత ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇదంతా భవిష్యతుపై ఆధారపడి ఉంది' అని అన్నారు. ఎవ్వరిని ఉద్దేశించి తాను కామెంట్లు చేయనని చెప్పారు. రాజస్థాన్ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ఎమ్మెల్యేలు, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటారో అని వేచిచూడాలని తెలిపారు.


Next Story

Most Viewed